వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే ఎరువుల పంపిణీ
10 Jan 2022 5:10 PM
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి
గిరిజనులకు మొబైల్ ఆధార్ కేంద్రం ప్రారంభం
నెల్లూరు: దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నా, రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే ఎరువుల పంపిణీ చేపడుతున్నామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడటంతోపాటు, గిట్టుబాటు ధర కల్పించేందుకు, నిరంతరం పర్యవేక్షిస్తూ, నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన కాలనీలో మొబైల్ ఆధార్ కేంద్రాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గిరిజనుల పిల్లలకు అందజేస్తున్న పోషకాహార వివరాలను ఎమ్మెల్యే ఆరా తీశారు. కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి, వరి సాగుకు అందిస్తున్న సాగునీరు, ఎరువుల పంపిణి తదితర విషయాలపై సమీక్షించి, రైతులతో చర్చించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, గిరిజనులు ఆధార్ నమోదు చేసుకోక, ఆధార్ లేనందున లబ్ధి పొందలేకపోతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆధార్ కార్డులేని నిరుపేద గిరిజనులను గుర్తించి, కాలనీల్లోనే ఎక్కడికక్కడ మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులు అందజేస్తున్నామన్నారు.
అమాయకులైన పేద గిరిజనులు ప్రభుత్వ పథకాలుల పట్ల అవగాహన లేక, తమ రెక్కల కష్టంతో జీవిస్తూ, ఆధార్ అవశ్యకతను గుర్తించక, ఆధార్ నమోదు ప్రక్రియకు దూరమవుతున్నారు. గిరిజనుల పేదరికాన్ని గుర్తించి, వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో, ఆధార్, రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామన్నారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, నూతన ఇళ్లు మంజూరు చేయించి, వాటిని మేమే నిర్మించిస్తామన్నారు. గిరిజనులకు చెందిన పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మించేందుకు నూతనంగా ఇళ్లు మంజూరు చేసి, నిర్మించి ఇస్తామని చెప్పారు. గిరిజనుల పిల్లలకు అంగన్వాడీ ద్వారా సరుకులు అందించడంతోపాటు, స్కూళ్లకు పంపించి చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమాయకులైన పేద గిరిజనులకు ప్రత్యేకించి, చల్లా యానాదుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచి, ఆదుకుంటామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడంతో పాటు, అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి తెలిపారు.