అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఘన చరిత్ర ఉన్నా ..అభివృద్ధిలో వెనుకబడిపోయాం
22 Jul 2019 11:49 AM
గత ప్రభుత్వం తాగునీటి పథకాలను నీరుగార్చింది..
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
అమరావతిః ఎంతో చరిత్ర కల్గిన గురజాల,దాచేపల్లి గ్రామాలను మున్సిపాల్టీలు చేయాలని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కోరారు. ఆయన సొమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 850 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయాయమని ఆవేదన వ్యకం చేశారు. వైయస్ రాజశేఖర్రెడ్డి,కాసు బ్రహ్మనందరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మాత్రమే మా ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. రూ.4వేల కోట్లతో నాగార్జున సాగర్ కాలువ ఆధునీకరణ జరిగిందన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి గురజాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు.
నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.దివంగత మహానేత వైయస్ఆర్ రూ.90 కోట్లతో ప్రవేశపెట్టిన మంచినీటి పథకాలను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఒక పథకం కూడా సక్రమంగా పనిచేయడం లేదన్నారు.8 లక్షల జనాభా ఉన్న గురజాల,మాచర్ల నియోజకవర్గాల్లో సరైన ఆసుప్రతి కూడా లేదన్నారు.వైద్యం చేయించుకోవాలంటే దూరంలో ఉన్న గుంటూరు,నరసరావుపేట ప్రాంతాలకు వెళ్ళాల్సివస్తుందన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల కూడా లేదన్నారు