మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని బాబుకు భయం
05 Aug 2020 7:31 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
విజయవాడ: చంద్రబాబు హైదరాబాద్లో దాక్కొని సవాలు విసురుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు మాకు సవాలు విసరడం కాదని, మేమే సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జోగి రమేష్ చాలేంజ్ చేశారు. ఉప ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలు ఓడిపోతారని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. రాజధాని అమరావతిని ఎక్కడికి తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతికి అదనంగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన అని రమేష్ తెలిపారు.