చంద్రబాబు ఖాళీగా ఉండలేక జోలెపట్టారు

వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ 
 

తిరుపతి: వికేంద్రీకరణకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు తిరుపతి నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ దుర్గా ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ..అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రూ.8.5 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఖాళీగా ఉండలేక జోలెపట్టి విరాళాలు సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
 

Back to Top