ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
పోలవరం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
15 Jul 2019 12:48 PM
ఆర్అండ్ఆర్లో జరిగిన అవినీతిని బయటకుతీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్వప్నాన్ని నిలబెట్టింది మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి కరువును తరిమి శాశ్వతంగా సాగు, తాగునీరు అందించాలని మహానేత వైయస్ఆర్ పోలవరం ప్రారంభించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లడమే తప్ప.. తట్టెడు మట్టి తీసిన పాపానపోలేదన్నారు.
పోలవరాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారన్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో లక్షల మంది నిర్వాసితులు ఉన్నారని, వారి గురించి ఏనాడూ చంద్రబాబు ఆలోచించలేదన్నారు. లక్ష మంది నిర్వాసితుల్లో 80 శాతం గిరిజనులే ఉన్నారని, వారి కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిర్వాసితులకు సేకరించిన భూముల్లో ఆర్ అండ్ ఆర్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. సంబంధిత మంత్రి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.