వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పోలవరం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
15 Jul 2019 12:48 PM
ఆర్అండ్ఆర్లో జరిగిన అవినీతిని బయటకుతీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్వప్నాన్ని నిలబెట్టింది మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి కరువును తరిమి శాశ్వతంగా సాగు, తాగునీరు అందించాలని మహానేత వైయస్ఆర్ పోలవరం ప్రారంభించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లడమే తప్ప.. తట్టెడు మట్టి తీసిన పాపానపోలేదన్నారు.
పోలవరాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారన్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో లక్షల మంది నిర్వాసితులు ఉన్నారని, వారి గురించి ఏనాడూ చంద్రబాబు ఆలోచించలేదన్నారు. లక్ష మంది నిర్వాసితుల్లో 80 శాతం గిరిజనులే ఉన్నారని, వారి కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిర్వాసితులకు సేకరించిన భూముల్లో ఆర్ అండ్ ఆర్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. సంబంధిత మంత్రి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.