మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కేసీఆర్ను మంచి అంటే బాబుకెందుకు కడుపుమంట
25 Jul 2019 3:25 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అమరావతి: శాసనసభను సజావుగా నడవనివ్వకుండా ఉండేందుకే ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినట్లుగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సభా నాయకులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గోదావరి జలాలపై మాట్లాడుతుండగా మధ్యలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేచి గందరగోళం సృష్టించారని, స్పీకర్ పోడియం చుట్టుముట్టేలా చంద్రబాబే వారిని ఉసిగొల్పారన్నారు. సభానాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివారన్నారు తప్ప చంద్రబాబు చెడ్డవాడని చెప్పలేదని చురకలు అంటించారు. చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి రెట్లు మంచివారని అంబటి అన్నారు. మంచివారంటే ఎందుకు చంద్రబాబుకు కడుపుమంట అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. శాసనసభలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.