విక్రమ్‌రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలి

ప్ర‌చారంలో మంత్రులు అంబ‌టి, పెద్దిరెడ్డి, కాకాణి

  నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని మంత్రులు అంబ‌టి రాంబాబు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విజ్క్ష‌ప్తి చేశారు. ఆదివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రులు మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు సరికావని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నెల్లూరులో క్రాప్‌ హాలిడే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ స్పష్టత లేని పార్టీ జనసేన అని దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదగా సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.  

Back to Top