చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
క్రైమ్ రేట్ చాలా తగ్గింది
07 Jun 2021 2:38 PM
హోం మంత్రి మేకతోటి సుచరిత
ఏటుకూరులో వ్యాక్సినేషన్ను పరిశీలించిన హోంమంత్రి సుచరిత
గుంటూరు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ చాలా తగ్గిందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చిత్తూరు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిని వ్యక్తికి 7 నెలల్లోనే.. ఉరిశిక్ష పడేలా చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
సోమవారం ఆమె ఏటుకూరులో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కేవలం రెండేళ్లలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్షా 31 వేల కోట్లు వేసిన ఘనత సీఎం వైయస్ జగన్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని, ఎన్నికల్లో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు.
టీడీపీ హయాంలో రిషితేశ్వరి హత్య జరిగితే ఏం చేశారో అందరికీ తెలుసు. దిశ చట్టం కింద 500 కేసుల్లో శిక్షలు ఖరారు చేశాం. విశాఖలో కర్ఫ్యూ సమయంలో బయటికొచ్చిన యువతి వద్ద పాస్ లేదు. అనుమతి పత్రాలు లేకపోవటంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులతో వాదన పెట్టుకుంది. సోషల్ మీడియాలో వచ్చినవే నిజాలు అనుకోకూడదని మంత్రి సుచరిత అన్నారు.