నెల్లూరు: వైయస్ జగన్ కాలి గోటికి కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: అవినీతి, అబద్ధాలతో బతికే నీకు జగన్ గారిని విమర్శించే స్థాయి ఎక్కడది?: – నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఎన్ని సంస్కరణలు తెచ్చానో చెప్తా.. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తెచ్చావో చెప్పు. – నీ హయాంలో రైతు భరోసా కేంద్రాలున్నాయా? వాటి ద్వారా ఎరువులిచ్చావా? ఉచిత పంటల బీమా ఉందా? – నీ హయాంలో ధాన్యం పుట్టి ధర రూ.12వేల నుంచి రూ.13 వేలు ఉండేది. – నీ పక్కన ఉన్న సోమిరెడ్డే రైస్మిల్లర్లు, దళారుల వద్ద రూ.50 కొట్టేశాడు. – ఇప్పుడు రూ.18,500 గిట్టుబాటు ధర ఉంటే...మిల్లర్లు రూ.22వేలు పెట్టి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. – రైతు రథాల పేరుతో ట్రాక్టర్ల ధర పెంచి..దానిలో కూడా నువ్వూ, నీ కొడుకు, సోమిరెడ్డి దోచుకున్నారు. – నిద్రలేస్తే అవినీతి, అబద్ధాల మయమైన నీకు జగన్ గారిని విమర్శించే స్థాయి ఎక్కడుంది? – నీకు ఎప్పుడూ గమ్యం ఉంటుంది కానీ..మార్గం ముఖ్యం కాదు అనుకునే వాడిని. – జీవితంలో, రాజకీయాల్లో వ్యక్తికి మార్గం ముఖ్యం. నీకసలు మార్గమే అవసరం లేదు. – దేనిమీదైనా సరే..నడిచి వెళ్లి గమ్యాన్ని చేరుకుంటే చాలనుకునే నీచమైన మనస్థత్వం నీది. – జగన్ గారు ఆ గమ్యాన్ని చేరుకోడానికి మార్గాన్ని అన్వేషించేవారు. – జగన్ గారితో నువ్వు ఈ జన్మలో సాటిరావు. నువ్వు ఎన్నిరకాలుగా ఆరోపణలు చేసినా ఫలితం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే అసలు వర్షాలు పడతాయా?: – వ్యవసాయం గురించి నువ్వు మాట్లాడితే నవ్వి పోతారు. ఎప్పుడన్నా సంపూర్ణంగా సాగు నీరు ఇచ్చిన సందర్భంలో నీ జీవితంలో ఏరోజైనా ఉందా? – అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా? రిజర్వాయర్లు నిండుతాయా? – రైతులు అసలు వర్షాలే లేవని ఏడుస్తుంటే నేను వ్యవసాయంలో నన్ను మించిన వాడు లేడని చెప్పుకుంటావు. – అనంతపురంలో వేరుశనగకు రెయిన్ గన్లని ఇస్తే నీ పాదం మోపిన పొలం కూడా ఎండిపోయింది. – నీ వ్యక్తిత్వం ఉన్నతమైంది కాకపోయినా నువ్వు ఉన్నతమైన పదవిని అనుభవించావు. – ఇలాంటి వాడినా మేం ముఖ్యమంత్రిగా చేసింది అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. – సోమిరెడ్డికి నువ్వు టికెట్ ఇవ్వకూడదని మూడు, నాలుగు పేర్లు పరిశీలించి..వాళ్లు ఎవరూ సర్వేపల్లి రాలేమంటే తిరిగి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చావు. – అలాంటి సోమిరెడ్డిని తీసుకొచ్చి ఆయనేదో ఈ నియోజకవర్గానికి చేస్తాడు అంటే నమ్మటానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్లా? – చివరికి కొత్తగా నిన్నగాక మొన్న కండువా వేసుకున్న వారికి కూడా టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని వాకబు చేశావు. – చివరికి ఎవరూ రాలేమంటే ఇతనికి ఇచ్చావు. టీడీపీ నాయకులు ఈ సీటుపై ఏం మాట్లాడుకున్నారో ఆడియో, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. – చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక సభ్యత, సంస్కారం ఉండేలా మాట్లాడాలి. నీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతావా చంద్రబాబూ?: – నీకు దమ్ము, ధైర్యం ఉంటే..నువ్వు నిజంగా నీతివంతుడివే అయితే నాపై చేసిన ఆరోపణలను నిరూపించండి. – నేనే స్వయంగా హైకోర్టులో నాపై వచ్చిన అభియోగాలపై సీబీఐతో విచారణ చేయించండి అని పిల్ వేసుకుంటా. – చంద్రబాబుకు చాలెంజ్ విసురుతున్నా. ఎన్నికలు అయ్యే లోపు నీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించుకుంటావా? – నేను సీబీఐకి లెటర్ రాస్తా..నువ్వూ రాయి..ఇద్దరం కలిసి విచారణ జరిపించుకుందాం. – ఇదే చాలెంజ్ నేను గతంలో కూడా విసిరాను. నాపై సీబీఐ విచారణ వేసినప్పుడే నేను ధైర్యంగా ఆహ్వానించాను. – నీ మీద వచ్చిన అబియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు..దాన్ని తొలగించుకుని సీబీఐ విచారణకు సిద్ధం అని చెప్పాలని డిమాండ్ చేశా. కానీ నువ్వు చెప్పలేకపోయావు. – నీపై అనేకమైన పాత, కొత్త ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్, స్కిల్ స్కాం...ఇలా చాలా ఉన్నాయి. – ఏమీ లేకుండా సర్వేపల్లిలో కేజీఎఫ్ అంటూ మాట్లాడితే ఎలా..? నువ్వు ఇక్కడకు రా. – ఇక్కడ నువ్వు చూడాల్సింది కేజీఎఫ్ కాదు..ఇక్కడ జరిగిన అభివృద్ధి చూడు. – సర్వేపల్లిలో అభివృద్ధిని చూస్తే నేను ఇలా కుప్పంలో చేయలేకపోయానే అని అన్నం కూడా ముట్టవు. నువ్వు సిగ్గుతో చచ్చిపోతావ్. – మా సభలకు వచ్చిన జనాల్లో సగం కూడా నీకు రావడం లేదంటే ప్రజలు నిన్ను ఏ మేరకు నమ్ముతున్నారో అర్ధం అవుతుంది. జగన్ గారి కాలిగోటితో కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదు: – 2019లో వన్సైడ్ పోలింగ్ జరిగింది...నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి 23 సీట్లకు పరిమితం అయ్యాడు. – ఈసారి ఆ 23లో 2 కానీ, 3 కానీ వస్తాయి. ఆ ఫ్రస్టేషన్లో నీకు జనం రాకపోతే..నేను జనాన్ని ఆపేశాను అంటున్నావు. – అంటే నేను ఎంత బలవంతుడినో నువ్వే ఒప్పుకుంటున్నావు. నీ పక్కన ఉన్న సోమిరెడ్డి ఎంత బలహీనుడో అర్ధం అవుతుంది. – నువ్వు చెప్తున్నట్లు అవినీతి జరిగి, అభివృద్ధి జరగకపోయి ఉంటే నీకు జనం నీరాజనాలు పట్టాలి కదా? – నీకు జనం రాలేదని నాపై, జగన్ గారిపై మండిపడితే ఎలా? – జగన్ గారి కాలి గోటికి నీ వ్యక్తిత్వం సరిపోతుందా? – రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేక, ప్రత్యామ్నాయంగా నువ్వేదో అనుభవజ్ఞుడివని నీవైపు మొగ్గు చూపారు. – నీ అనుభవం ఏంటో 2014–19లో కొండలు వద్ద నుంచి అన్నీ ఉండలు చేసుకుని అబ్బా కొడుకులు తిన్నప్పుడే ప్రజలకు అర్ధం అయ్యింది. – అందుకే నీ అనుభవం ఇక చాలయ్యా...అని జగన్ గారికి అధికారం కట్టబెట్టారు. – మళ్లీ సిగ్గులేకుండా నా అనుభవం అంటూ చెప్పుకుంటున్నాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోయావు? – ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తాను అంటున్నావ్..అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. – నువ్వేం చేశావో..నువ్వు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావో చెప్పు. – జగన్ గారు తానిచ్చిన హామీలు 99 శాతం అమలు చేశారని ప్రజలే చెప్తున్నారు. నీ సర్టిఫికెట్ అవసరం లేదు. – అడ్డుతొలగించైనా సరే ఏదో ఒక విధంగా ఆ కుర్చీలో కూర్చోవాలన్నట్లు తయారయ్యాడు. మైకేల్ జాక్సన్లా మైకు తగిలించుకుని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు: – జగన్ గారి పరిపాలన గురించి ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడిన నీకు ఇప్పడు అభ్యర్థులను పెట్టుకోడానికి చెమటలు పడుతున్నాయి. – ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత ఎవరు కల్పించారో ఒక్క సారి చూసుకో. – నువ్వు చేసిన ఆరోపణలపై నేను విచారణకు సిద్ధంగా ఉన్నా..నీపై వచ్చిన ఆరోపణలకు నువ్వు విచారణకు సిద్ధమా? – నువ్వు అవినీతిపరుడివి కాదు అనుకుంటే ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ వేయించుకో. – నిన్నటి సభ అట్టర్ ప్లాప్ అయ్యింది..ప్రజాగళం మూగబోయింది. – ఇక చంద్రబాబుకు ఏపీలో అన్ని చోట్ల బాయ్ బాయ్ చెప్పినట్లు నెల్లూరు జిల్లాలోనూ అదే విధంగా చెప్పారు. – మా హయాంలో ఎక్కడైనా రైతులు రొడ్డుమీదకు వచ్చి మాకు నీరివ్వలేదని, విత్తనాలు, ఎరువుల కొరత, గిట్టుబాటు ధర రాలేదనే మాట వినిపించలేదు. – నీకూ..మాకు ఉన్న తేడా అది. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. సుపరిపాలనను అందుకున్న ప్రజలే మాకు సర్టిఫికెట్ ఇస్తారు. – మైకేల్ జాక్సన్లా ఒక మైకు తగిలించుకుని మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. – నిన్న నీ యాత్రతో నెల్లూరు జిల్లాలో నీకు ఒక్క సీటు కూడా వచ్చేది లేదనేది అర్ధం అయిపోయింది. – చంద్రబాబునాయుడు వాగ్ధానాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేనేలేదు. – ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు..రేపు సూపర్ 8 అంటాడు..ఆ తర్వాత సూపర్ 80 అంటాడు. – ఆయన చాంతాడంత హామీలిచ్చినా ప్రజల్లో ఉన్న భావం ఒకటే. చంద్రబాబు చెప్పి ఎగ్గొడతాడు..జగన్ గారు చెప్పింది చెప్పినట్లు ఇంటికి చేరుస్తాడు. – ఆ నమ్మకం, విశ్వాసం జగన్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. – చంద్రబాబు యాత్రలు, జగన్ గారి యాత్రలను భేరీజు వేసుకోండి. మీకే అర్ధం అవుతుంది. – చంద్రబాబుకు జనం రాక..గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాగళం సభలతో చంద్రబాబు ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు: – నిన్న చంద్రబాబు పొదలకూరులో ప్రజాగళం అంటూ గళం విప్పాడు. – ముందు మూడు రోడ్ల జంక్షన్ అన్నాడు..తర్వాత జనాల్లో స్పందన లేదని రోడ్డు మీద పెట్టాడు. – చంద్రబాబు సభ 3 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. గూడూరు కార్యక్రమం అయిపోయిన తర్వాత సుమారు గంటన్నర వెయిట్చేశాడు. – ఆయన చెప్పిన 3 గంటలకు కనీసం వంద మంది కూడా రాలేదు. – చంద్రబాబుకు పొదలకూరు మండల కేంద్రంలో లిబరల్గా లెక్కేసినా వచ్చిన జనం 1500 మంది. – పొదలకూరు వచ్చి సోమిరెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సోమిరెడ్డి స్థాయికి దిగిపోయాడు. – చంద్రబాబుకు పెద్ద స్థాయి ఉందా అంటే అదీ లేదు. రామారావు పిల్లనివ్వబట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది అంతే. – రోజూ వాట్సప్లో వచ్చినవి ప్రింట్ అవుట్ తీసుకుని చదివి వెళ్లిపోయినట్లుంది. – పాము తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే, ఇది కాటేస్తే మనిషి బతకడు అని చెప్తున్నాడు. – సోమిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే అతను మీకు పనిచేస్తాడు అని చెప్తున్నాడు. – నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావా? లేదా? నేను గుర్తు చేయాలా? – నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పొదలకూరుకు ఏం చేశావు..నీ వల్ల ఏం ఒనగూరిందో చెప్పాలి. – సర్వేపల్లి నియోజకవర్గానికి నీవల్ల ఏం ఒనగూరిందో చెప్తే బాగుండేది. – చంద్రబాబు వచ్చి నన్ను, జగన్ గారిని తిట్టడం తప్ప చేసిందేమీ లేదు. – నీ ప్రజాగళంలో ఇక్కడి ప్రజలకు నువ్వు ఏ రకంగా భరోసా ఇవ్వగలిగావు?