సీజన్‌ ప్రారంభానికి ముందే ఆయిల్ పామ్‌ ధరలు నిర్ణయం

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

విజ‌య‌వాడ‌: సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ పామ్‌ ధరలను నిర్ణయించనున్నట్టు   మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అమరావతిలో ఇవాళ ఆయిల్ పామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తాం.. సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామన్నారు. ఓఈఆర్ (ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అప్‌డేట్‌ చేస్తామని వెల్లడించారు.  అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని తెలిపారు.  ఆయిల్ పామ్ ధరల నిర్ణయంలో రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, గత ప్రభుత్వం చెల్లించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ బకాయిలను వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.  డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశాలిచ్చామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్ల‌డించారు.

Back to Top