కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బోయ కులానికి వాల్మీకి మహర్షి మా జగనన్న
24 Jul 2019 2:49 PM
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
అమరావతి: బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మ రాత రాస్తాడని అందరూ అంటుంటారు బ్రహ్మ రాశాడో లేదో తెలియదు కానీ.. మా జగనన్న మా అందరికీ రాత రాశారన్నారు. వాల్మీకి బోయ కులానికి చెందిన తనకు మంత్రి పదవి కల్పించడం మా జగనన్నకే సాధ్యమైందన్నారు. బోయ కులానికి వాల్మీక మహర్షి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్ లాంటి వారు.. ముస్లింలకు అల్లా, క్రిస్టియన్స్కు జీసస్ లాంటి వ్యక్తి మన సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అని వివరించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. ఎన్నికల తరువాత అందరూ సమానమేనని మాట చెప్పారన్నారు.