ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తాం

కండలేరు జలాశయాన్ని పరిశీలించిన మంత్రి అనిల్, ఎమ్మెల్యేలు

నెల్లూరు: జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తామని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలు ఉందన్నారు. 60 టీఎంసీల నీటిని నిల్వచేస్తామన్నారు. జిల్లాలో ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తాం. వరుసగా రెండేళ్లు జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయని వివరించారు. జలాశయాల కింద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను తక్షణం పునరావాసాలకు తరలించాలి.. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  
 

Back to Top