కమీషన్ల కోసం పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు

పశ్చిమ గోదావరి : కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని మంత‌రి ఆళ్ల నాని మండిపడ్డారు.   గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో తెలియకుండా గత టీడీపీ ప్రభుత్వం జనాన్ని మభ్య పెట్టిందని అన్నారు.. ముఖ్యమంత్రి రేపు ప్రాజెక్టును సందర్శించి ఇక్కడి పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top