జూన్‌ 7 నుంచి టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ప్రకాశం: జూన్‌ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ కావాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 

Back to Top