రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తాం
19 Sep 2019 11:26 AM
మంత్రి ఆదిమూలపు సురేష్
తిరుపతి: నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. తిరుమలలో ఈరోజు ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి మరో నాలుగు రోజుల్లో కొలువుదీరుతుందని తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టారని కితాబిచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని సరళతరం చేశారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మఒడి’ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.