ఆ రెండింటిని కలిపి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలి

లోక్‌సభలో  ఎంపీ మార్గాని భరత్ 

రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరం

న్యూఢిల్లీ:   తూర్పు గోదావ‌రి జిల్లాలోని కాకినాడతో కలిపి రాజమహేంద్రవరాన్ని జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో‌ ప్రస్తావించారు. ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరమని గుర్తుచేశారు. ప్ర‌స్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.   పర్యాటక, విద్య, ఆరోగ్య కేంద్రంగా మారేందుకు ఆ నగరానికి అన్ని అర్హతలన్నీ ఉన్నాయని, అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులూ నిర్మించాలని చెప్పారు. ఇటీవల మరో 21 పంచాయతీలు అందులో కలిశాయని తెలిపారు. 

Back to Top