వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

వైయస్‌ఆర్‌సీపీలో చేరిన జయసుధ

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పేర్కొన్నారు. గురువారం ఆమె హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..  వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం సొంతింటికి వచ్చినట్టుందన్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. 
 

Back to Top