వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని  కలిసిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు

 తాడేపల్లి : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. సీనియర్‌ అధికారులు కృష్ణబాబు, వరప్రసాద్‌, సంధ్యారాణి, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, ఐజీ సంజయ్‌, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్‌, కార్తికేయ మిశ్రా, సత్యనారాయణ, ఎస్పీలు రవిప్రకాశ్‌, మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. కాగా వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం తాడేపల్లి చేరుకున్నారు. 

Back to Top