మంత్రి పెద్దిరెడ్డికి ఊరట.. నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ

మీడియా సమావేశాలు నిర్వహించేందుకు అనుమతిచ్చిన హైకోర్టు

అమరావతి: స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇటీవల విధించిన ఆంక్షలపై ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పెడ్డిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేస్తూ.. మీడియా సమావేశాలు కూడా నిర్వహించడానికి కూడా వీల్లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. ఎస్‌ఈసీ ఆర్డర్స్‌ను వ్యతిరేకిస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ హైకోర్టు.. మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. 

 

Back to Top