సర్వేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీలోకి జోరుగా వలసలు 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:  సర్వేపల్లి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతోంది. శ‌నివారం  ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం, రామ్ నగర్‌ల నుంచి మంత్రి కాకాణి సమక్షంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీని వీడిన వారంద‌రికీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కండువాలు క‌ప్పి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డి ప్రవర్తనతో విసిగి, వేసారి తెలుగుదేశం పార్టీ వీడడానికి సిద్ధమయ్యామ‌ని పార్టీలో చేరిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులై పార్టీలో చేరిన‌ట్లు తెలిపారు.  సర్వేపల్లి లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణి గెలుపు లాంచనమేనని.. సోమిరెడ్డి ముసలి కన్నీరు చూసి కరిగే వారు ఎవ్వరూ లేరని పేర్కొన్నారు.

అభివృద్ధి చేయలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన సోమిరెడ్డి సానుభూతి కోసం తపిస్తున్నాడని.. సోమిరెడ్డి పట్ల సర్వేపల్లి ఓటర్ ఎవరు సానుభూతి చూపించరని, సోమిరెడ్డికి మరోసారి ఘోర ప‌రాజ‌యం త‌ప్పదని పార్టీలో చేరిన వారు హెచ్చ‌రించారు.

Back to Top