బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
గవర్నర్కు సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
03 Aug 2019 3:28 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో కలకాలం ఆయురాగ్యోలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. గవర్నర్ హరిచందన్ తన 85 పుట్టినరోజు వేడుకలను గిరిజన, దళిత చిన్నారులతో జరుపుకున్నారు. పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.
అనంతరం గిరిజన, దళిత బాలబాలికల సమక్షంలో కేక్ కట్ చేసి నిర్వహించి, చిన్నారులకు నూతన వస్త్రాలు, నోట్ పుస్తకాలు అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్కు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొడాలి నాని, పేర్పి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.