బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీఎం వైయస్ జగన్ గ్రాఫ్ను ఎవరూ తగ్గించలేరు
13 Jul 2022 5:55 PM
టీడీపీ జీతగాడు రాబిన్శర్మ సంస్థతో బోగస్ సర్వే
ఇలాంటి సర్వేలు వైయస్ఆర్ సీపీని ఏం చేయలేవు..
మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు పేర్ని నాని
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గ్రాఫ్ తగ్గిందనడం విచిత్రంగా ఉందని, మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్ సర్వేను బయటకు వదిలారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు పేర్ని నాని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అంటే ఏమిటో ప్రజలకు తెలుసు.. ఇలాంటి సర్వేలు ఏం చేయలేవు.. వైయస్ జగన్ గ్రాఫ్ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై, వైయస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడిందన్నారు.
సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదని, అలాంటప్పుడు వాళ్లు రిపోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మరి ఎలా ఇస్తారన్నారు. పవన్ కల్యాణ్ ద్వారా టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూశారని, అది సాధ్యం కాలేదన్నారు. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ లేవడం లేదని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ తరువాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయిందని పేర్ని నాని అన్నారు.