వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గ్రామ సచివాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం
05 Oct 2021 4:13 PM
విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి గ్రామసచివాలయాన్ని సందర్శించారు. మంగళవారం కురుపాం నియోజక వర్గంలోని గుమ్మలక్ష్మిపురం మండలం పి. ఆమిటి, మండ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది, వలంటీర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల పట్టిక,లబ్దిదారుల జాబితా నోటీస్ బోర్డ్ లో ఉంచుతున్నారా? లేదా? అని పరిశీలించారు. పోడుపట్టాలు, ఇళ్ళ స్థలాలు ,రైతు భరోసా, చేయూత , వైయస్ఆర్ పింఛను కానుక, విద్యాదీవెన, వసతి దీవెన అలాగే అన్ని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజల సమస్య లు అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు సూచించారు.