విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు నిత్యం శ్రమిస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆళ్లనాని శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలని మంత్రి సూచించారు.ప్రజలంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం శ్రేయస్కరమన్నారు.సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపుతున్నాయని ఆళ్లనాని చెప్పారు.