సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం

వలంటీర్లతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే, గంజి చిరంజీవి  

మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్‌ను సీఎం వైయ‌స్‌ జగన్‌ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమ­ర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ నేప­థ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదా­రులు సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్రపటానికి, నిడమ­ర్రులో వైయ‌స్ఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఎమ్మె­ల్యే ఆర్కే మాట్లాడుతూ.. కుల, మత, రాజకీ­యా­లకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ రూ.5 వేల పింఛన్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీ­లను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతు­లు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయా­రైన పరిస్థితు­లను చూశామన్నారు.

రాజధాని నిర్మా­ణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పా­టు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలే­కపో­యాడని విమర్శించారు.  ఇలాంటి పరిస్థితుల్లో అధి­కారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీ­ల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు.  

Back to Top