వైయస్‌ జగన్‌ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది

ప్రజల బాగుకోసం ఆలోచించే వ్యక్తి వైయస్‌ జగన్‌

జగన్‌ సీఎం అయితే రాష్టం అభివృద్ధి చెందుతుంది

ఎన్టీఆర్,వైయస్‌ఆర్‌ లక్షణాలు జగన్‌లో ఉన్నాయి

వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి

హైదరాబాద్‌:ప్రజల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ నేత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రలో ప్రతి వ్యక్తి బాధ వైయస్‌ జగన్‌ తెలుసుకున్నారు.ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైయస్‌ జగన్‌లో ఉందన్నారు. ప్రజలను  సొంత కుటుంబంలా వైయస్‌ జగన్‌ భావిస్తారని,ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.వైయస్‌ జగన్‌ ఒక కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని, వైయస్‌ జగన్‌ వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా,ఆయనపై ఎన్ని కుట్రలు చేసిన ప్రజల కోసం బాధ్యతగా,ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు. మాట తప్పని,మడమ తిప్పని వ్యక్తి వైయస్‌ జగన్‌ అని అన్నారు. ఏమి చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయో  వైయస్‌ జగన్‌ ప్రతిక్షణం ఆలోచన చేస్తున్నారన్నారు. .వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రజల కోసమే చేశారన్నారు. విద్య,ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నారన్నారు.

తన తండ్రిలాగే వైయస్‌ జగన్‌ ప్రజలకు మంచిచేస్తారు: అచ్చిరెడ్డి

ప్రజల కోసం బాగు కోసం కృషిచేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత అచ్చిరెడ్డి కోరారు.తన తండ్రిలాగే వైయస్‌ జగన్‌ ప్రజలకు మంచి చేస్తారన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఏపీకి మేలు జరుగుతుందన్నారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు వైయస్‌ జగన్‌ తెలుసుకుని వారిని ఆదుకోవడానికి కృషిచేస్తున్నారన్నారు.ప్రజలకు మంచి జరిగే పనులకే వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇస్తారన్నారు.ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న వారే ప్రజానాయకుడు అవుతారన్నారు.ఎన్టీఆర్,వైయస్‌ఆర్‌ లక్షణాలు వైయస్‌ జగన్‌నలో ఉన్నాయన్నారు.ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో వైయస్‌ జగన్‌ ఉన్నారని తెలిపారు.స్వార్థ« ప్రయోజనాలు కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించవద్దన్నారు.

 

Back to Top