ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, పరాస్ పాశ్వాన్లతో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి భేటీ అయ్యారు. విభజన తరువాత ఏపీ 74 శాతం వ్యవసాయంపై ఆధారపడిందని, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని కేంద్రమంత్రి పరాస్ పాశ్వాన్ను కోరారు. అదే విధంగా ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని మరో మంత్రి కిషన్రెడ్డిని కోరానని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పారు. భవిష్యత్తులో ఏపీ టూరిజం హబ్గా మారుతుందన్నారు.