చిత్తూరు: చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలని, అచ్చెన్నాయుడుకు ధైర్యం ఉంటే చంద్రబాబుతో రాజీనామా చేయించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. కుప్పంలో చంద్రబాబుపై వైయస్ఆర్ సీపీ కార్యకర్త గెలవడం ఖాయమన్నారు. మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దళిత హోంమంత్రిని అవమానించిన అయ్యన్నపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పకుంటే దళితులంతా ఏకమై తిరగబడతారని హెచ్చరించారు.