ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం

ఆర్‌ అండ్‌ బి శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

 కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలి

 అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలి
 
కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలన్న సీఎం.

పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

వచ్చే జూన్, జులైకల్లా  నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలి

దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం.. వారి కడుపుమంటకు మందులేదు. 

పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను ప్రారంభించిన సీఎం. 

పంచాయ‌తీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.

తాడేప‌ల్లి:  నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతుండ‌టంతో పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వినియోగించి రోడ్లు నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. ఎఫ్‌డీఆర్ ప్ర‌తిపాద‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.  రాష్ట్రంలో ఉన్న రోడ్ల‌ను పూర్తిగా బాగు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయి.   ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయ‌ని, వారి కడుపుమంటకు మందులేద‌న్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి.  అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాల‌ని అధికారుల‌కు సూచించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో పంచాయ‌తీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:

  •  ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలి.
  •  కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలి. 
  •  రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదు.
  •  రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలి.
  •  దీనివల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్‌ అవుతాయి. నిర్వహణకూడా సజావుగా, నాణ్యతతో సాగుతుంది.
  •  దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి.
  •  నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలి.
  •  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని తెలిపిన అధికారులు.
  • ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదన.
  •  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న సీఎం. 
  •  మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలన్న సీఎం.
  •  వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలన్న సీఎం.
  •  అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలన్న సీఎం.
  •  కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి.
  •  ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు.
  •  అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. 
  •  ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి.
  •  దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయి. 
  •  ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయి.
  •  వారి కడుపుమంటకు మందులేదు. 
  •  అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. 
  •  పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను సమీక్షా సమావేశంలో ప్రారంభించిన సీఎం. 
  •  స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం.
  •  యాప్‌ ద్వారా దీనికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం.
  •  జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదు.
  •  దీనిపై కమాండ్‌ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు.
  •  ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలు.
  •  పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలన్న సీఎం.
  •  పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు  రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదుచేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి.
  •  ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలన్న సీఎం.
  •  యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
  •  నాణ్యత మీద ప్రత్యేక దృష్టిపెట్టినప్పుడు అవే సమస్యలు ప్రతిసారి రావన్న సీఎం.
  •  రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  •  రిపేర్‌ చేయడమే కాకుండా, వాటి నాణ్యతమీద కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి.
  •  ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలి.
  •  రోడ్డు మరమ్మతులలో దీర్ఘకాలం నిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. 
  • ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్న దొర, ఆర్‌ అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా),  పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వి వి సత్యనారాయణ,  గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న,  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Back to Top