తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం వైయస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా 24న తిరుమలలోని కర్ణాటక సత్రాలకు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.