ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. సచివాలయంలో కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్‌ బిల్లులు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో చర్చించనున్నారు.  

Back to Top