వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నన్నయ్య యూనివర్సిటీ ఘటనపై సీఎం సీరియస్
11 Oct 2019 12:22 PM
విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశం
రాజమండ్రి: నన్నయ్య యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ విద్యార్థినులను డిపార్టుమెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. స్పెషల్ క్లాసులంటూ తన ప్లాటుకు పిలిపించుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధిత విద్యార్థినులు లేఖ ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఎం విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.