వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
‘జగనన్న గోరుముద్ద’ పక్కాగా అమలు చేయాలి
03 Feb 2021 5:16 PM
స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్తో శిక్షణ
ఉన్నతాధకారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్
తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో మనబడి నాడు–నేడు పనులపై సమీక్ష అనంతరం జగనన్న గోరుముద్ద, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోరుముద్ద పథకంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. నిర్వహణ కోసం దాదాపు 49 వేల మంది సిబ్బంది అవసరమని, టాయిలెట్ల నిర్వహణపై ఎస్ఓపీ టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ శిక్షణ ఇస్తుందని చెప్పారు.