మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అదే మా తపన, మా ఆరాటం
27 May 2021 6:35 PM
అత్యున్నత ప్రమాణాలతో వైయస్ఆర్ ప్రీప్రైౖ మరీ, ఫౌండేషనల్ స్కూళ్లలో విద్యాబోధన
3 నుంచి 8 ఏళ్ల చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటుపై పరిశీలన చేయాలి
డిజిటల్ బోధన ప్రక్రియ (డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టండి
మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేలా సరికొత్త ఆలోచనలు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మెదడు బాగా అభివృద్ధి చెందే 3 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్కూళ్లలో యధావిధిగా వైయస్ఆర్ సంపూర్ణ పోషణ అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో 11, 12 తరగతులు పెట్టడమా..? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలా..? అన్న అంశంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.
ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
మంచి విద్యాభ్యాసం కోసమే మనబడి నాడు–నేడు..
‘‘పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది. అందుకే ఈ ఆలోచన. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఈ వైయస్ఆర్ ప్రీప్రైౖ మరీ స్కూళ్లు, ఫౌండేషనల్ స్కూళ్లు. అన్ని వసతులతో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం కోసమే మనబడి నాడు–నేడు చేపట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నాము.
అధికారులు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనల వల్ల కాస్ట్ ఇంపార్ట్, ఎడ్యుకేషన్ ఇంపాక్ట్పె పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్ కాలేజీ పెట్టాలనుకున్నాం. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది.
పీపీ స్కూళ్లు–మ్యాపింగ్..
ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషనల్ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్ దూరం లోపల ఉండాలి. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలి. వైయస్ఆర్ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్ చేయాలి. టీచర్లలోని బోధనా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలి. తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి.. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశం. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషనల్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు–నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి.
డిజిటల్ టీచింగ్..
స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్ వాడీలు (పీపీ–1, పీపీ–2), 1, 2 తరగతుల ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్ బోధన ప్రక్రియ (డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్ బోధనా పద్ధతులు (టీచింగ్ మెథడాలజీ) రూపొందించండి. మనం బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డ్స్కు మారాం. ఇక ముందు డిజిటల్ బోర్డ్స్కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం పని సామర్థ్యం) ఉండేలా చూసుకోండి. మనం ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్గా ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్లను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి. ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్రూమ్లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటినీ సమీక్షించాలి’’ అని సీఎం వైయస్ జగన్ నిర్దేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.