క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న స‌మీక్షా స‌మావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌, ఆరోగ్య శాఖ స్పెష‌ల్ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. జిల్లాలో కొన‌సాగుతున్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, కోవిడ్ ఆస్ప‌త్రులు, కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో వైద్య ప‌రీక్ష‌లు, క‌రోనా నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

 

Back to Top