కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు
25 Sep 2020 5:17 PM
ప్రతీ పంట కూడా ఆర్బీకే నుంచి ప్రొక్యూర్ చేయాలి
మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా చూడాలి
నెల్లూరులో జరిగిన ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదు
ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫాంపై మరింత ఫోకస్ పెట్టండి
ఈ సీజన్లో కూడా రూ.3,300 కోట్ల మేర వ్యవసాయఉత్పత్తుల కొనుగోలు జరగాలి
అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై సీఎం సమీక్ష
తాడేపల్లి: రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రొక్యూర్మెంట్ సీజన్ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, రైతులకు ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులను ఆదేశించారు. రైతు పండించే ప్రతీ పంట ఆర్బీకే నుంచి ప్రొక్యూర్ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలన్నారు. ప్రతీ ఆర్బీకే వద్ద పంటల కనీస మద్దతు ధరలపై పెద్ద డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఆర్బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలన్నారు.
రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలని, దీన్ని సీరియస్గా ఎన్ఫోర్స్ చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలన్నారు. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వీటన్నింటినీ జాయింట్ కలెక్టర్లు చూసుకోవాలని ఆదేశించారు. వాటర్ రియాలిటీ, మార్కెట్ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంట అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలని, ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. సార్టెక్స్ వెరైటీని ప్రమోట్ చేయాలి. బ్రొకెన్ రైస్ను కూడా వాల్యూ ఎడిషన్ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
కాటన్ కొనుగోళ్లలో స్కామ్లు జరగకూడదని, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. పత్తి రైతులకు న్యాయం జరగాలని, మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్ పోగొట్టుకోకూడదన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫాం మీద మరింత ఫోకస్ పెట్టడంతో పాటు బహిరంగ మార్కెట్లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్ఫాంకు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఈ సీజన్లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.