తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, తదితరులు పాల్గొన్నారు.