బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
విశాఖపట్నం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
17 Dec 2021 4:27 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. విశాఖ చేరుకున్న అనంతరం ఎన్ఏడీ జంక్షన్లో ఎన్ఏడీ ఫ్లై ఓవర్తో పాటు వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మరో 6 ప్రాజెక్ట్లను ప్రారంభిస్తారు. సాయంత్రం విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్ట్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.