సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం విరాళం

తాడేప‌ల్లి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విరాళం అంద‌జేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఏపీ సైనిక్‌ వెల్‌ఫేర్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top