సంఘీభావ దీపోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సంఘీభావంగా ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపం వెలిగించి దీపోత్సవంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ దీపాలు ఆర్పివేయగా సీఎం వైయస్‌ జగన్, అధికారులు దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు.  రాష్ట్ర ప్రజలు కూడా రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించారు.  
 

Back to Top