ఇంధన పొదుపు, సంరక్షణలో జాతీయ స్ధాయిలో సత్తా చాటిన ఏపీ

మంత్రి, అధికారుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఇంధన పొదుపు, సంరక్షణలో జాతీయ స్ధాయిలో  ఆంధ్రప్రదేశ్ స‌త్తా చాటింది. ఏపి ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు ఏపీ గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.  ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని ఎంపిక చేసిన కేంద్రం.

ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును రాష్ట్ర అధికారులు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌కు  ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృద్వితేజ్ చూపించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.

Back to Top