మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
యువ ఐఏఎస్ అధికారులకు సీఎం అభినందనలు
23 May 2020 5:15 PM
సీఎం వైయస్ జగన్తో ప్రొబేషనరీ ఐఏఎస్ బ్యాచ్ భేటీ
తాడేపల్లి: ఏపీ క్యాడర్కు చెందిన 10 మంది ఐఏఎస్లకు అసిస్టెంట్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. యువ ఐఏఎస్ అధికారులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. శనివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రొబేషనరీ ఐఏఎస్ 2019 బ్యాచ్ భేటీ అయ్యింది. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ ఐఏఎస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్లదే కీలకపాత్ర అన్నారు. ఐఏఎస్లు చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీస్స్టేషన్ల ఏర్పాటును యువ ఐఏఎస్లకు సీఎం వైయస్ జగన్ వివరించారు.