సీఎం క్యాంపు కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు

 కేక్ కట్ చేసిన సీఎం వైయ‌స్ జగన్
 

 తాడేపల్లి: నూతన సంవత్సరం 2022 వేడుక‌లు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేక్ కట్‌ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల‌తో క‌లిసి సీఎం కేక్‌ కట్ చేశారు. అనంత‌రం ముఖ్య‌మంత్రికి మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అదికారులు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top