వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ క‌ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, లేళ్ల అప్పిరెడ్డి, పండుల ర‌వీంద్ర‌బాబు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌, జ‌గ‌న్‌మోహ‌న్‌రావు, ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top