నేటి నుంచి వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న 

 మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం
 
బ‌ద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరులలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 23, 24, 25 తేదీల్లో వైయ‌స్ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్‌ వేడుకల్లోనూ పాల్గొంటారు.

ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన షెడ్యూల్‌ ఇలా..
♦ 23వ తేదీ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్‌లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్లను ప్రా­రంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. 
♦ ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. 
♦ అనంతరం ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు.
♦ అలాగే, వైయ‌స్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు. 
♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు. 
♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు. 
♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయల్దేరి వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. 
♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. 

Back to Top