నేడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌

పులివెందుల‌: వైయ‌స్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. నేడు సింహాద్రిపురంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైయ‌స్ఆర్ ఘాట్‌కు చేరుకొని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళుల‌ర్పించారు. మ‌రికాసేప‌ట్లో ఇడుపులపాయలోని చర్చిలో జ‌రిగే ప్రార్థనల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. 

మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్‌ కళాశాల సమీపంలో ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైయ‌స్ఆర్ పార్క్‌, తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఎకో పార్క్‌ మీటింగ్‌ ప్రదేశంలో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.

Back to Top