బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్.. రైట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్
20 Sep 2022 3:47 PM
విద్యా, వైద్యరంగాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి వైయస్ జగన్
అనేక ప్రశ్నలకు సమాధానం నాడు–నేడు
ప్రపంచంలో విద్యావ్యవస్థ వేగంగా మారుతోంది
గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవి
డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు
మేం వచ్చాక స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం.. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం
మనబడి నాడు–నేడు ద్వారా 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల అభివృద్ధి
స్కూళ్ల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
అమ్మ ఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు మేలు
అమ్మ ఒడి పథకం కింద ఇప్పటివరకు రూ.19 వేల కోట్లు ఖర్చు చేశాం
గోరుముద్ద పథకానికి ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం
విద్యాకానుక కింద రూ.886 కోట్లు ఖర్చు
విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నాం
వచ్చే విద్యా సంవత్సరం నాటికి 15 వేలకు పైగా స్కూళ్లలో డిజిటలైజేషన్
అసెంబ్లీ: విద్యారంగంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి మన పిల్లల చదువుల మీద మనం పెట్టే పెట్టుబడి. మన పిల్లలను మంచి పౌరులను తయారు చేసేందుకు, మారుతున్న ప్రపంచంలో మన పిల్లలు విజ్ఞానంతో నిలబడేందుకు పెట్టుబడి పెడుతున్నాం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బడులల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్లే ఆడపిల్లలు చదువులకు దూరం అవుతున్నారన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ.. ఏరోజు దాన్ని రిపేర్ చేయాలని ఆలోచన గతంలో చేయలేదు.. డ్రాపవుట్రేట్స్ పెరుగుతున్నా కూడా.. వీటిని మార్చాలనే కనీసం ఆలోచన జరగని అధ్వాన్నమైన పరిపాలన గత ప్రభుత్వంలో చూశాం అని సీఎం వైయస్ జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత పాలనలో ఎందుకు పట్టించుకోలేదు.. ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాధానం ‘నాడు–నేడు’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విద్యా, వైద్యరంగాల్లో నాడు–నేడుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు.
విద్యారంగంలో జరిగిన పలు మార్పుల గురించి..
‘‘ప్రపంచం మారుతోంది. చదువులు కూడా మారుతున్నాయి. దానికి తగట్టుగానే ప్రపంచమంతా చదువుల విషయంలో.. 2040లో చదువులు ఎలా ఉండబోతున్నాయి.. అందుకు తగ్గట్టుగా మన పిల్లలను ఎలా తయారు చేసుకోవాలని ప్రపంచమంతా ప్రణాళికలు వేసుకుంటుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో పిల్లలు ఇంకా ఎక్కువ మంది 1950లో ఉన్న ఆ విద్యావిధానంలో, దశాబ్దాలుగా పట్టించుకోని స్కూళ్లలో చదువు చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని అభిప్రాయపడే అర్థం కాని పరిస్థితి మనం అధికారంలోకి రాకముందు వరకు ఉన్నాయి.
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా ముందు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. వీరిని ఇలాగే వదిలేద్దామా.. లేక మార్పులు ఏమైనా తీసుకురావాలా వద్దా అనే రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు అధికారంలోకి రాకముందు వరకు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ అడుగులు పడ్డాయి. బడులను గతంలో లాగా శిథిలావస్థలో పెట్టి.. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసే గత పరిస్థితిని గుర్తుచేసుకుంటే బాధ అనిపిస్తుంది.
మారుతున్న పోటీ ప్రపంచంలో మన పిల్లలను, మన బడులను బాగు చేసుకొని ఈ వ్యవస్థను ఎలా నిలబెట్టాలనే ఆలోచనతో అడుగులు ముందుకుపడ్డాయి. విద్యారంగం మీద మనం చేస్తున్న ఖర్చులన్నీ రాజకీయ దురుద్దేశంతో, దుర్బుద్ధితో రకరకాలుగా మాట్లాడే స్వరాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇటువంటి వారి స్వరాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
విద్యారంగం మీద, పిల్లల చదువుల మీద మనం పెట్టేది పెట్టుబడి. రాబోయే సమాజం మీద, మంచి పౌరులను తయారు చేసేందుకు మనం పెట్టుబడి పెడుతున్నాం. మారుతున్న ప్రపంచంలో మన పిల్లలు విజ్ఞానంతో నిలబడేందుకు పెట్టుబడి పెడుతున్నాం. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని అనాల్సి వస్తుంది. మానవ వనరుల మీద మనం పెట్టుబడి పెడుతున్నాం.
గవర్నమెంట్ బడుల్లో నాడు–నేడు ఎందుకు చేయాల్సి వచ్చిందో.. మనం అధికారంలోకి రాకముందు మన గవర్నమెంట్ బడుల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్య లేకుండా చేసి.. సీబీఎస్ఈ సిలబస్ లేకుండా చేసి.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు లేకుండా చేసి.. ప్రభుత్వ బడుల్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని నీరుగార్చి.. ప్రభుత్వ బడుల్లో స్కూల్ బుక్స్ సైతం నెలల తరబడి జాప్యంతో ఇస్తూ నిర్వీర్యం చేసి.. చివరకు మొత్తం ప్రభుత్వ బడులకు వెళ్లడం వేస్ట్ అనే అభిప్రాయం ప్రజలకు కలిగించేలా, ఆ భావన వచ్చేలా మొత్తంగా ప్రభుత్వరంగంలో బడులే లేకుండా చేయాలనే దుర్బుద్ధి ఆలోచనతో గత ప్రభుత్వం తనకు కావాల్సిన కార్పొరేట్ స్కూల్స్ను ప్రోత్సహించేందుకు అడుగులు వేశారు.
బడులల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్లే ఆడపిల్లలు చదువులకు దూరం అవుతున్నారన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ.. ఏరోజు దాన్ని రిపేర్ చేయాలని ఆలోచన గతంలో చేయలేదు. బెంచీలు, మాస్టర్ కుర్చీలు, ఫ్యాన్లు, మంచినీళ్లు, కాంపౌండ్ వాల్స్, చివరకు మంచి బ్లాక్ బోర్డ్స్ కూడా లేకుండా గవర్నమెంట్ బడి అంటే.. అక్కడ ఏమీ ఉండవని ప్రజలకు భావన కల్పించాలనే గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇవన్నీ కారణాల వల్ల డ్రాపవుట్రేట్స్ పెరుగుతున్నా కూడా.. వీటిని మార్చాలనే కనీసం ఆలోచన జరగని అధ్వాన్నమైన పరిపాలన గత ప్రభుత్వంలో చూశాం.
అప్పట్లో పాఠశాలలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు దేవుడి దయతో మంచి ఆలోచనలతో, మంచి మార్పులు తీసుకొని వస్తుంటే స్కూళ్లు ఎలా ఉన్నాయో ఉదాహరణలతో సహా చూపిస్తాం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో స్కూల్స్ ఎలా ఉన్నాయో గమనిస్తే.. ఎంపీపీ స్కూల్ నారావారిపల్లెలో నాడు.. ఇదే నారావారిపల్లెలో నేడు స్కూల్. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గవర్నమెంట్ హై స్కూల్ నాడు–నేడు కింద మార్చాం.
ప్రతీ అడుగులోనూ మార్పు అనేది ఎంత ప్రస్పుటంగా కనిపిస్తున్నాయో ఫొటోలే స్పష్టంగా చెబుతాయి. ఇలాంటి మార్పులేవీ చేయకుండా ఎందుకు స్కూళ్లను గాలికి వదిలేశారని ప్రశ్నించాల్సిన అంశం. ఎవరి ప్రయోజనాల కోసం మన బడులను గాలికి వదిలేశారు.. దెబ్బతీశారని ప్రశ్నించాలి. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన కూడా చేయాలి.
పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు తరతరాలూ పేదరికాన్ని తమ భుజాన మోసుకుంటూ చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటూ చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటూ పేదరికంలో మిగిలిపోతున్న వీరి పరిస్థితుల మీద తిరుగుబాటుగా మన విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చాం. బహుశా.. కొద్ది మినహాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. ఈ సామాజికవర్గాల వారు స్వతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా ఆర్థిక, సామాజిక కారణాల వల్ల తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకోలేకపోతున్నారు.
ప్రపంచమంతా ఇంగ్లిష్ మీడియం వైపుగా అడుగులు వేస్తున్నా.. మనం వేయలేని పరిస్థితులు. గవర్నమెంట్ దగ్గరుండి అలా అడుగులు వేయకుండా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే తరం పిల్లలకు నాణ్యమైన అభివృద్ధి వైపు అడుగులు వేయించే విధంగా వారి చదువులు వారి చేతికి అందేలా చేయగలిగితే ప్రతీ ఇంటా వెలుగులు నిండుతాయి. కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కేవలం నినాదం కాకుండా.. రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్, రైట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్.. ఈ రెండూ వారికి అందుబాటులోకి తీసుకువచ్చి.. వారిని గొప్పగా చదివించే బాధ్యతను మనందరి ప్రభుత్వం తీసుకుంది. మూడు సంవత్సరాలుగా మనం అనుసరిస్తున్న విద్యావిధానం కూడా ఇదే.
విద్యారంగంలో గొప్ప మార్పుల్లో భాగమే మనబడి నాడు–నేడు..
ప్రతీ గవర్నమెంట్ స్కూల్లో 12 రకాల మార్పులు చేపట్టాం. 12 రకాల మార్పులు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. నాడు–నేడు అంటే ఏమిటీ.. ఆ పనులు పూర్తయిన తరువాత ఎలాంటి మార్పులు కనిపించాలో క్లియర్గా ఆదేశాలిచ్చాం.
1.ప్రతీ స్కూల్లో మంచి టాయిలెట్స్ ఉండటం..
2. మంచి నీటి సరఫరా ఉండటం..
3. చిన్నా, పెద్ద రిపేర్లు ఉంటే చేయించడం.
4. స్కూల్స్లో విద్యుదీకరణ, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు అన్నీ ప్రతీ క్లాస్రూంలో అందుబాటులోకి తీసుకురావడం.
5. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరికి సంబంధించి మంచి ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం.
6. ప్రతీ క్లాస్రూమ్లో గ్రీన్చాక్ బోర్డు కచ్చితంగా ఉండేలా చూడటం.
7. స్కూల్ బిల్డింగ్ను శుభ్రంగా పెయింటింగ్ చేయించడం.
8. ప్రతీ స్కూల్లోనూ ఇంగ్లిష్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం.
9. స్కూల్ భవనానికి ప్రహరీ గోడ నిర్మించడం.
10. ప్రతీ స్కూల్లో మంచి కిచెన్ షెడ్ నిర్మించడం.
11. అవసరం మేరకు అదనంగా తరగతి గదులు నిర్మించడం.
12. నాడు–నేడు అయిన ప్రతీ క్లాస్ రూమ్లోనూ డిజిటల్ లెర్నింగ్ బోర్డు తీసుకురావడం...
ఇలా 12 రకాల అంశాలు నాడు–నేడుతో ఇవన్నీ కావాలని దిశానిర్దేశం చేశాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేలకుపైగా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రీపైమరీలుగా, ఫౌండేషన్ స్కూల్స్గా మారుతున్న అంగన్వాడీలు, హాస్టల్స్ను కూడా మనబడి నాడు–నేడు కిందకు తీసుకురావడం జరిగింది. మన బడి నాడు–నేడు ద్వారా మొత్తం 57 వేల స్కూల్స్, హాస్టల్స్ రూపురేఖలు మారుతున్నాయి. వీటిని మూడు దశల్లో చేపడుతున్నాం. ఇందుకోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తుంది.
తొలిదశలో భాగంగా 15715 స్కూళ్లను రూ.3700 కోట్ల వ్యయంతో సమూలమైన మార్పులు తీసుకువచ్చాం. మొదటి ఫేస్లో పూర్తయిన 15,715 స్కూల్స్లో చివరగా 12వ అంశం.. ఆ పాఠశాలల్లోని క్లాస్ రూమ్లో డిజిటల్ లెర్నింగ్ కోసం ఐఎఫ్బి ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి 15715 స్కూళ్లలో డిజిటలైజేషన్ పూర్తవుతాయి.
నాడు–నేడు మనబడి రెండో దశలో మరో 22,344 స్కూళ్లను ఆధునీకరించడం జరుగుతుంది. ఇందులో యూనిక్ స్కూల్స్ 16,911. స్కూల్స్ అన్నింట్లో రూ.8 వేల కోట్ల వ్యయంతో సకలసదుపాయాలతో పూర్తిగా నాడు–నేడు కార్యక్రమం రెండో దశకు శ్రీకారం చుట్టడం మొదలుపెట్టాం. అంతేకాకుండా స్కూళ్లలో సదుపాయాలు కల్పించడమే కాకుండా.. వాటిని నిర్వహణపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేల కోట్లు ఖర్చు చేసి స్కూళ్లలో మార్పులు తీసుకువస్తున్నాం. వీటిని మనం మెయిన్టైన్ చేయలేకపోతే.. ఇవన్నీ పాత పరిస్థితికి వచ్చేస్తాయి. ప్రతీ స్కూల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ క్రియేట్ చేశాం. ఇందులో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ మన స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్, వాష్బేసిన్ను క్లీన్గా ఉంచుతారు. స్కూళ్ల నిర్వహణలో ఈ తరహాలో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. దీని కోసం అమ్మఒడిలో ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలలో ఒక వెయ్యి రూపాయలను ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెమ్మకు చెప్పడం జరిగింది. మన పిల్లలు వెళ్లే స్కూళ్లలో టాయిలెట్స్ బాగా ఉంచేందుకు, బాగోలేకపోతే ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉండేందుకు వెయ్యి రూపాయలు కేటాయించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేరకు గడిచిన రెండేళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ కింద రూ.448 కోట్లు ప్రతీ ఏటా జమ చేయడం జరుగుతుంది.
టాయిలెట్ల నిర్వహణ, స్కూల్స్, కాలేజీలలో పరిశుభ్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44,968 స్కూల్స్, కాలేజీలను టేకప్ చేసి వీటిలో 47 వేల మంది ఆయాలను రూ.6 వేల గౌరవ వేతనంతో పాటు గ్లౌజ్, క్లీనింగ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్...
స్కూల్ భవన నిర్వహణ కోసం నిధిని కూడా అమ్మ ఒడి నుంచి వెయ్యి రూపాయలు కేటాయించాలని అక్కచెల్లెమ్మలను రిక్వస్ట్ చేశాం. ఈ ఏడాది నుంచి ఆ నిధిని సేకరిస్తుండగా మొత్తం రూ.450 కోట్లు జమ చేయడం జరిగింది. ఈ మొత్తంతో స్కూల్స్లో ఎప్పటికప్పుడు అవసరమైన చిన్న చిన్న మరమ్మతులకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఒక సామెత కూడా ఉంది.. స్టిచ్చింగ్ టైమ్.. సేవ్స్ నైన్ అనే సామెత కూడా ఉ ంది. సమయానికి ఒక్క చుట్టుతో పోయేది.. వదిలేస్తే.. ఆ కుట్టు పెద్దదై తొమ్మిది కుట్లు అక్కడే వేయాల్సి వస్తుంది. మన స్కూల్స్ ఎప్పుడూ కొత్తగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ బాధ్యతను స్కూల్స్లో పిల్లలకు సంబంధించిన పేరంట్స్ కమిటీకి, హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పర్యవేక్షణ అదనంగా యాడ్ చేయడం జరిగింది.
మన పిల్లల భవిష్యత్ బాగుండాలని, విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం అమలు చేస్తున్న విద్యా దీవెన (పూర్తి ఫీజురీయింబర్స్మెంట్), వసతి దీవెన (హాస్టల్, మెస్ ఖర్చుల కింద ఇచ్చే రూ. 20వేలు). వీటన్నింటి వల్ల 18–23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు కాలేజీల్లో చేరే సంఖ్యను గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. ఆ జీఈఆర్ పెరిగేట్టుగా ప్రతీ అడుగులు వేస్తున్నాం. చిన్న పిల్లాడి నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు ప్రతీ పిల్లాడిని, పాపను చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. బ్రిక్స్ దేశాలతో మనం పోల్చుకుంటాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా లాంటి దేశాలు. బ్రెజిల్లో 18–23సంవత్సరాల వయసులోని వారు కాలేజీల్లో 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం, మన దేశంలో కేవలం 29 శాతం మాత్రమే. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2035వచ్చే నాటికి 70 శాతానికి తీసుకెళ్లాలనే ధృడ నిశ్చయంతో అడుగులు వేస్తున్నాం.
ప్రాధమిక విద్యారంగంలో కూడా ఇదే రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జీఈఆర్ కేంద్రప్రభుత్వ విద్యాశాఖ, మానవవరుల అభివృద్ధిశాఖ 2018లో విడుదల చేసిన డేటా చూస్తే... ఏపీలో ప్రైమరీ స్కూల్స్లో చేరే (2015–16లో ) జీఈఆర్ 84.48 శాతం కనిపిస్తోంది. అప్పట్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 36లో ఏపీ 29 రాష్ట్రాలలో అతితక్కువ స్ధానంలో ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. మిగిలిన ఏ రాష్ట్రం 84.48 కంటే తక్కువ లేదు. మనం కేవలం కేంద్రపాలిక ప్రాంతాల కంటే మాత్రమే ఎక్కువగా ఉన్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనమున్నామని చెప్పే డేటా ఇది.
ఇటువంటి పరిస్థితుల్లో విప్లవాత్మక చర్యలు ఎంత అవసరమో మనందరికీ తేటతెల్లం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం రావడం, నాడు నేడుతో పాటు పేదపిల్లల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బడులకు మరలా వైభవం తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేసింది. అందులో మొదటి అడుగు అమ్మఒడి.
అమ్మ ఒడి:
దేశంలో ఇలాంటి పథకం మరే రాష్ట్రంలోనూ లేదు.
దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాల్లో పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15వేల ఆర్థిక సహాయం చేస్తూ.. దాన్ని 75 శాతం హాజరుతో ముడిపెట్టి ఆ పిల్లలను తల్లులు బడికి పంపిస్తే.. ప్రతి సంవత్సరం రూ.15వేలు ఇచ్చే పథకం.
ఈ మూడేళ్లలో 84 లక్షల పిల్లలకు తద్వారా 44.5 లక్షల మంది తల్లులకు మేలు చేశాం. మూడు సంవత్సరాలలో ఇందుకోసం ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం రూ.19,617.60 కోట్లు.
గోరుముద్ద:
ఈ పథకంలో రోజుకొక మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం. ఇది రోజుకొక మెనూతో చేస్తూ... వంట చేసే వడ్డించే ఆయాలకు గతంలో రూ.1000 గౌరవవేతనం ఇస్తూ.. దాన్ని కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన పరిస్థితులు, సరుకులు బిల్లులు కూడా 8 నెలలు పైగా పెండింగ్లో పెట్టిని పరిస్థితి. ఆ పరిస్థితి మారాలని అన్నం వండి, వడ్డించే ఆయాలకు రూ.1000ను కాస్తా రూ.3000 కు ఆగష్టు,2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచాం. గోరుముద్ద పథకంలో పిల్లలకు వారానికి 5 కోడిగుడ్లు. మూడు రోజులు చిక్కీ ఇస్తున్నాం.
గోరుముద్ద పథకంలో గత ప్రభుత్వ హయాంలో రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయడానికి మనసు రాని పరిస్థితి నుంచి మనం... ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీన్ని మానిటర్ చేయడానికి ఒక ఐఏఎస్ అధికారి తన కింద నలుగురు అధికారులతో పాటు ఒక యంత్రాంగాన్ని క్రియేట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాం.
విద్యాకానుక:
పిల్లలకు వారు స్కూల్లో చేరే సమయానికి స్కూల్ బ్యాగ్తో పాటు, మూడు జతల యూనిఫాం, కుట్టుకూలి, ఒక జత షూష్, రెండు జతల సాక్స్లు, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, నోట్బుక్స్, ఇంగ్లిషు టు తెలుగు ఆక్ష్ ఫర్డ్ డిక్షనరీతో పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
మరోవైపు విద్యాకానుకలో భాగంగా 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు మొత్తం 5.18 లక్షల ట్యాబ్స్ ఈ నవంబరులో ఇవ్వబోతున్నాం. 4.70 లక్షల మంది పిల్లలకు, 50 వేల మంది టీచర్ల అందరికీ ట్యాబ్స్ ఇవ్వబోతున్నాం. ట్యాబ్ స్పెషిఫికేషన్స్తో అమెజాన్, ప్లిప్కార్టులలోకి వెళ్లి చూస్తే.. దీని ఖరీదు రూ.16,500 కనిపిస్తోంది. ఇవే ట్యాబ్స్ కోసం మనం రివర్స్ టెండరింగ్తో పాటు మూడేళ్ల పాటు వ్యారంటీ ఇచ్చేటట్టుగా, రీప్లేస్మెంట్ చేసే విధంగా, ట్యాబ్ చెడిపోతే గ్రామ సచివాలయంలో వారం రోజుల్లోగా దాన్ని రీప్లేస్ చేసేటట్టుగా చేసి టెండర్లు పిలిస్తే.. రూ.12,840 కు మనకు ఆఫర్ వచ్చింది. ప్రతి పిల్లాడికి విద్యాకానుకలో భాగంగా రూ.12,840తో కూడిన ట్యాబ్ కూడా ఇస్తున్నాం. దీనికోసం రూ.665 కోట్ల ఖర్చు చేస్తున్నాం. ఎనిమిదో తరగతిలో చేరే మన పిల్లలందరూ కూడా 2025లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షకు సిద్ధం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమేరకు వీరందరినీ సన్నద్ధం చేసేందుకు ఈ ట్యాబులు ఉపయోగపడతాయి. వీటితో పాటు బైజూస్ సంస్ధతో ఒప్పందం చేసుకున్నాం. మార్కట్లో ఈ యాప్ను ప్రైవేటుగా కొనుగోలు చేస్తే.. ప్రతి పిల్లాడికి రూ.20 నుంచి రూ.24వేలు అవుతుంది. ఈ యాప్ను ఉచితంగా ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లల ట్యాబ్లో ఉచితంగా లోడ్ చేసి ఇస్తున్నాం.
విద్యాకానుక పథకంలో మొత్తం 47 లక్షల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుండగా, ఇప్పటి వరకు రూ.886.68 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయడం జరిగింది.
2018–19లో ప్రభుత్వ బడులలో 37,20,988 మంది పిల్లలు చదువుతుంటే... 2021–22లో ప్రభుత్వ బడులలో పిల్లల సంఖ్య చదివే 44,29,561 మంది. అంటే ప్రభుత్వ బడులలో చదివే పిల్లల్లో ప్రభుత్వం మీద నమ్మకం పెరిగి 37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు.
విద్యాదీవెన:
నాలుగో కార్యక్రమం జగనన్న విద్యాదీవెన.
అప్పట్లో నాన్నగారు హయాంలో పూర్తిఫీజు రీయింబర్స్మెంట్ చేసే కార్యక్రమం చూశాం. ఆయన చనిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. ఆ పథకాన్ని ఎలా నీరుగార్చాలన్న విధంగానే అడుగులు పడ్డాయి. ఆ పరిస్థితులు పూర్తిగా మార్చుతూ... విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించే ఈ పథకంలో ఇప్పటి వరకు 24.74 లక్షల పిల్లలకు ప్రయోజనం కలగజేస్తూ, అందుకోసం మొత్తం రూ.8365 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీకు ఆలస్యం లేకుండా క్వార్టర్ అయిపోయిన వెంటనే ముందు క్వార్టర్ కాలానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిన రూ.1777.49 కోట్లు బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. నాన్నగారు ఒక అడుగు వేస్తే... మనం రెండు అడుగులు వేస్తామని చెప్పినట్టుగానే వసతి దీవెన పథకాన్ని కూడా దీనికి యాడ్ చేశాం.
వసతిదీవెన:
పిల్లలకు హాస్టల్ ఖర్చుల కింద ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్ పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు చొప్పున రెండు దఫాల్లో ఇచ్చేటట్టుగా, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు ఇస్తూ వసతి దీవెన పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి 18.77 లక్షల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.3349.57 కోట్లు జమ చేయడం జరిగింది. వసతిదీవెన, విద్యాదీవెన పథకాల కింద మనందరి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడేళ్లలో రూ.11,715 కోట్లు వ్యయం చేసింది. వీటితో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులలో కరిక్యులమ్లో కూడా మార్పులు తీసుకువచ్చాం. కరిక్యులమ్ కూడా జాబ్ఓరియెంటెడ్గా ఉండేట్టుగా తీసుకునిరావడంతోపాటు ఇంటర్నెషిప్ తప్పనిసరి చేశాం. మైక్రోసాప్ట్, నాస్కామ్, హెచ్సీఎల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను సర్టిఫికేట్ కోర్సులు ఇచ్చేటట్టుగా వాళ్లను కూడా భాగస్వామ్యులను చేశాం.
ఇలా విద్యా రంగంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక మన పిల్లల భవిష్యత్ పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం నాటుతున్న విత్తనాలు మొలకెత్తి, పెరిగి ఫలాలు రావడానికి కాస్తా సమయం పడుతుంది. ఒక్కసారి ఫలాలు వస్తే పూర్తిగా దేశంతో కాదు ప్రపంచంలో పోటీపడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను.