తాడేపల్లి: టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన చలమలశెట్టి సునీల్.. సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సునీల్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పాల్గొన్నారు.