2025 నాటికి క్షయవ్యాధిని సమాజం నుంచి తరిమికొడదాం..!

 రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు..!
 

అనంత‌పురం: 2025 నాటికి క్షయవ్యాధిని సమాజం నుంచి తరిమికొడదామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాప్తాడు నియోజక వర్గం పరిధిలోని  40 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు దాదాపుగా వెయ్యి రూపాయల విలువ కలిగిన పౌష్ఠిక ఆహారాన్ని శాసన సభ్యులు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి తన సొంత నిధులతో అందజేశారు. సోమవారం ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భందా శాసన సభ్యులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ..2025 సంవత్సరం నాటికి ఈ సమాజం నుండి క్షయ వ్యాధిని తరిమి కొట్టడానికి సక్రమంగా మందులతో పాటుగా సరియైన పౌష్ఠికాహారం తీసుకుంటేనే సాధ్యమవుతుంది.   క్షయవ్యాధి ఉండకూడదనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో క్షయవ్యాధి లేకుండా చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రస్తుతం ఉన్న క్షయవ్యాధి గ్రస్తుల కోసం మందులు, పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకొచ్చింది. వారి దినచర్యపై అవగాహన కల్పిస్తోంది. బలహీనత వల్ల, పౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి మరింత దాడి చేసే ప్రమాదముంది. రోగ నిరోధకశక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.  రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం విషయములో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని రకాల వ్యాధులను చేర్చి పేదలకు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా చూస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను మరియు మౌలిక వసతులను సమకూర్చి, వైద్యము కొరకు అత్యంత ప్రాధాన్యతను ఇçస్తున్నారు అధునాతన క్షయ పరీక్ష చేయడానికి ట్రూనాట్‌ పరికరాలను 160 వరకు కొనేందుకు  చర్యలు తీసుకుంటోంది.  జిల్లాలో ప్రజా ప్రతినిధుల లో మొదటిగా స్పందించిన గౌరవ శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి జిల్లా క్షయ వ్యాధి నివారణా అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్‌జిఓ సంఘం నగర కార్యదర్శి శ్రీధర్‌బాబు, జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, శ్రావణి, మహేష్,  నాగమణి, జయవర్దన్, సూరి, శ్రీనివాస్, రేవతి, నిర్మల, వెంకటేష్, సుమన్‌ పాల్గొన్నారు..

Back to Top