బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్
16 Jun 2020 4:28 PM
సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సమ్మిళితం చేసేలా బడ్జెట్ రూపొందించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి సోమవారం రెండోదఫా బడ్జెట్ను (2020–21) ప్రవేశపెట్టారు.ట్టేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
- రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
ఈ సారి బడ్జెట్లో ఈ రంగాలకు భారీగా అదనపు కేటాయింపులు
- బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయింపులు
- మైనార్టీ సంక్షేమానికి గతేడాది కంటే 115 శాతం అదనంగా కేటాయింపులు
- సాంఘిక సంక్షేమానికి గతేడాది కంటే 110 శాతం అదనంగా కేటాయింపులు
- మహిళా, శిశు సంక్షేమానికి గతేడాది కంటే 28 శాతం అదనంగా కేటాయింపులు
వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు
- వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు,
- ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
- డాక్టర్ వైయస్ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
- వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
- రైతు భరోసా కేంద్రాల కోసం రూ.100 కోట్లు
- వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్కు రూ.3,615.60 కోట్లు
- జువ్వలదిన్ను, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు రూ.142.66 కోట్లు
- పశుగాణాభివృద్ధి, మత్స్య రంగానికి రూ.1279.78 కోట్లు
- ప్రాథమిక, ఇంటర్ విద్యకు రూ.22,604.01 కోట్లు
- జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
- 104, 108లకు రూ.470.29 కోట్లు
- వ్యవసాయ ల్యాబ్లకు రూ.65 కోట్లు
- పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్కు రూ.16,710.34 కోట్లు
- స్కిల్ డెవలప్మెంట్కు రూ.856.64 కోట్లు
- ట్రాన్స్పోర్టు, ఆర్అండ్ బీ కోసం రూ.6,588.58 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు
- పర్యాటక శాఖ రంగానికి రూ.273.66 కోట్లు
- మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
- రియల్ టైం గవర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు
- రెవెన్యూ రంగానికి రూ.7,964.08 కోట్లు
- పారిశ్రామిక రంగానికి రూ.2,705.14 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు
- గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు
- కాపు సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖకు రూ.24,934.82 కోట్లు
- పర్యావరణం, అటవీ శాఖకు రూ.457.32 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.6,984.72 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.3,520.85 కోట్లు
- ఆర్థిక రంగానికి రూ.50,703 కోట్లు
- సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు
- వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి రూ.1500 కోట్లు
- డ్వాక్రా మహిళల సున్నావడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు
- వైయస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.16 వేల కోట్లు
- జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6 వేల కోట్లు
- వైయస్ఆర్ చేయూత పథకానికి రూ.3 వేల కోట్లు
- వైయస్ఆర్ ఆసరా పథకానికి రూ.6300 కోట్లు
- వైయస్ఆర్ వాహన మిత్ర పథకానికి రూ.275.52 కోట్లు
- వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి రూ.200 కోట్లు
- జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు
- జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్ కోసం రూ.425.93 కోట్లు
- సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
- రవాణా రంగానికి రూ.6,588 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ.200 కోట్లు
- గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
- హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
- జలవనరుల శాఖకు రూ.11,805.74 కోట్లు
- పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
- ఐటీ రంగానికి రూ.197.37 కోట్లు
- న్యాయ శాఖకు రూ.913.76 కోట్లు
- మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ.8,150.24 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు
- ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
- డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కోసం రూ.2100 కోట్లు
- నేషనల్ హెల్త్ మిషన్ కోసం రూ.1808.03 కోట్లు
- వైయస్ఆర్ లా నేస్తం కోసం రూ.12.75 కోట్లు
- రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు
- జగనన్న విద్యా కానుక కోసం రూ.500 కోట్లు
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్మీడియం కోసం రూ.55.15 కోట్లు
- కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లు
- ప్రతిభా స్కాలర్షిప్స్ కోసం రూ.10.54 కోట్లు
- నేషనల్ హార్టికల్చర్ మిషన్కోసం రూ.150.99 కోట్లు
- పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ.389.89 కోట్లు
- రైతులకిచ్చే నష్టపరిహారం కోసం రూ.20 కోట్లు
- గ్రామ సచివాలయాల కోసం రూ.1633 కోట్లు
- అమరావతి–అనంతపురం నేషనల్ హైవే కోసం రూ.100 కోట్లు
- డ్రగ్స్, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ.400 కోట్లు
- కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ.242.15 కోట్లు
- వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ.100 కోట్లు